మందుల అమ్మకానికి అనుమతివ్వాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేసింది గ్రేటర్ హైదరాబాద్ రిటైల్ మెడికల్ షాప్స్ అసోసియేషన్. ఈ–పోర్టల్ విధానానికి వ్యతిరేకంగా 30న దేశవ్యాప్తంగా మెడికల్షాపుల బంద్కు మద్దతుగా నగరంలోని 12,500 మెడికల్ షాపులను మూసివేస్తున్నట్లు తెలిపారు అసోసియేషన్ కార్యదర్శి కిషన్ మురారి శెట్టి. ఔషధాల ధరలు పెరిగేందుకు తాము కారణం కాదని, కనీస ఔషధాల ధర నిర్ణయించేది ప్రభుత్వమేనన్నారు. ప్రభుత్వాలే ఔషధాల ధరను నియంత్రించాలని కోరారు ఆయన. షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ ఔషధాలు ఆన్లైన్లో విక్రయిస్తే ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు కలిగే అవకాశముందని విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు మురారి శెట్టి. మందుల చీటీపై ఔషధాల పేరును స్పష్టంగా ఆన్లైన్లో రాయాలని, జనరిక్ మందులు రాయాలన్న నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు ఆయన.