హైదరాబాద్ : సర్వేలు పక్కనబెట్టి ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. రాహుల్ సభపై హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రైతుల సమస్యలను పక్కన బెట్టి వచ్చే ఎన్నికల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వాతంత్య్ర కాలం నుంచి ఇప్పటి వరకు మేం చేసిన పోరాటాలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉందన్నారు.