ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాతబస్తీని గోల్డెన్‌ సిటీగా మార్చేందుకు కృషి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2017, 04:50 PM

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలోని పాతబస్తీని గోల్డెన్‌ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ బాలాజీనగర్‌లో రూ.40లక్షల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైప్‌లైన్‌ను ఆయన ప్రారంభించారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్‌ స్వప్న తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com