హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటిస్తున్నారు. పలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కోదండరామ్నగర్ కాలనీ వాసులు తమ సమస్యలను మేయర్కు తెలిపారు. చిన్నపాటి వర్షానికే తమ ప్రాంతం మునిగిపోతున్నదని మొరపెట్టుకున్నారు. సమస్యను అధ్యయనం చేసి పరిష్కారం చూపాల్సిందిగా మేయర్ అధికారులను ఆదేశించారు.