టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి కేసీఆర్ సవాల్పై స్పందించారు. తమను రాజీనామా చేయమనడం కేసీఆర్ పిచ్చివాదన అని ఉత్తమ్ అన్నారు. అసెంబ్లిని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని, తాము ఓడితే దేనికైనా సిద్ధమేనని, టిఆర్ఎస్ ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. ఇతర పార్టీల నుంచి కొనుక్కున్న ఎంపీలు, ఎమ్మెల్యేలతోనైనా రాజీనామాచేయించి ఎన్నికలకు వెళ్లగలరా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు చట్టాలని సీఎం, స్పీకర్ కలిసి తూట్లు పొడుస్తున్నారని, ప్రగతిభవన్లో పడుకొని ఏదో చేశానని చెప్తే ప్రజలు నమ్మేస్తారా అని విమర్శించారు.