సికింద్రాబాద్: సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి వ్యవసాయ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. మార్కెట్ ఛైర్మన్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న 9 గంటల ఉచిత కరెంట్తో రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. కాగా రైతులు కూరగాయల సాగు వైపు దృష్టి ఎక్కువగా సారించాలని సూచించారు. కూరగాయలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గించి ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి పాల్గొన్నారు.