ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రస్థాయి వ్యవసాయ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2017, 09:49 PM

 


సికింద్రాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి వ్యవసాయ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మార్కెట్ ఛైర్మన్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న 9 గంటల ఉచిత కరెంట్‌తో రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. కాగా రైతులు కూరగాయల సాగు వైపు దృష్టి ఎక్కువగా సారించాలని సూచించారు. కూరగాయలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గించి ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com