ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ప్రాంగణంలో నిర్మించనున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనానికి మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, టి.పద్మారావులతో, దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.