రంగారెడ్డి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలతో కొందుర్గు మండలంలోని నవాబ్ పేట రోడ్డు తెగిపోయింది. దీంతో ఈ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. తంగలపల్లి, చెక్కలోనిగూడెం, గంగనగుండె, చెరుకుపల్లి వాసులకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పాడైన రోడ్డును పునరుద్దరిస్తున్నారు.