హైదరాబాద్ : ఈ నెల 23న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్కు రానున్నారు. శిల్పారామంలో జరుగనున్న వరల్డ్ డివైన్ ఫోరం సదస్సులో ప్రణబ్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సమీక్ష నిర్వహించారు. పోలీసులు కూడా బందోబస్తుపై దృష్టి సారించారు.