ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ శవ రాజకీయాలు చేస్తుంది : హరీష్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2017, 02:47 PM

సంగారెడ్డి : కాంగ్రెస్ శవ రాజకీయాలు చేస్తున్నదని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. చనిపోయిన వారిని అడ్డం పెట్టుకొని అనవసర విమర్శలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. అమీన్‌పూర్‌లో హరీష్‌రావు సమక్షంలో 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనుల పట్ల ఇతర పార్టీల నేతలు, ప్రజలు ఆకర్షితులవుతున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం లేకపోవడంతో ఎస్‌ఐ ఆత్మహత్యపై కూడా పిచ్చి పిచ్చి విమర్శలు చేశారని కోపోద్రిక్తులయ్యారు. నిజాలు తెలిసిన తర్వాత నోళ్లు మూసుకున్నారని చెప్పారు. అనవసర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com