మాదాపూర్: మాదాపూర్లోని హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి తెలిపిన సమాచారం మేరకు.. మాదాపూర్ ఎన్ఆర్ఎస్ రాయల్ క్లబ్ హోటల్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో పోలీస్ బృందం దాడి చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడిపత్రికి చెందిన బాధితురాలిని గుర్తించి రెస్క్యూహోమ్కు తరలించారు. చింతల్ రోడామిస్త్రీనగర్కు చెందిన సహ నిర్వాహకుడు ఎండీ హనీఫ్తోపాటు తమిళనాడుకు చెందిన హోటల్ మేనేజర్ కాళిదాస్ను అరెస్ట్ చేశారు. నిర్వాహకురాలు సోని అలియాస్ లక్కీతోపాటు మరో సహ నిర్వాహకుడు అరుణ్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.