చైనాకు చెందిన మొబైల్ మేకర్ షియోమీ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇటీవల విడుదల చేసిన రెడ్మీ నోట్ 4 మొబైల్ను రేపు (ఆదివారం) ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయించనుంది. బుధ, శుక్రవారాల్లో ఈ స్మార్ట్ఫోన్ ఈకామర్స్ సైట్లో అందుబాటులో ఉంటున్నా ఈ వారంలో ఒక ఆఫ్లైన్ సేల్ ఉండనున్నట్టు ఇటీవల ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్కార్ట్లో రెడ్మీ నోట్4 మొబైళ్లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 కాగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999. గోల్డ్, గ్రే, మ్యాట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.