నువ్విలా’, ’జీనియస్’, ’రామ్లీల’, వంటి చిత్రాల్లో నటించి నటుడిగా ప్రేక్షకులను మెప్పించాడు హీరో హవీష్. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ సినిమాల మీదున్న ప్యాషన్తో నువ్విలాతో సినిమా రంగంలోకి ప్రవేశించాడు హవీష్. ఈ యువ హీరో ఒక వైపు వ్యాపారం, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళుతున్నాడు. ప్రస్తుతం హవీష్ హీరోగా జవహర్బాబు, రమేష్ వర్మ నిర్మాతలుగా ఓ సినిమా రూపొందుతుంది. సాయి అనే నూతన దర్శకుడు ఈ సిని మాను తెరకెక్కిస్తున్నాడు. హీరో హవీష్ పుట్టినరోజు జూన్ 25 (ఆదివారం). ఈ సందర్భంగా హవీష్ శనివారం పాత్రికే యులతో ముచ్చటించారు. హీరో హవీష్ మాట్లాడుతూ.. ’నేను అమెరికాలో చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చిన్నికృష్ణగారితో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ కొన్ని అనుకోని కారణాలతో ఆ సినిమా చేయడానికి వీలుప డలేదు. అప్పుడే సినిమాలపై ఉన్న ఆసక్తి ఇంకా బలపడింది. దాంతో నటుడిగా నన్ను నేను హైప్ చేసుకోవడానికి వైజాగ్ సత్యానంద్గారి దగ్గర ఆరు నెలలు పాటు శిక్షణలో ట్రయి నింగ్ తీసుకున్నాను. తర్వాత రవిబాబుగారి దర్శకత్వంలో ’నువ్విలా’ అవకాశం రావడంతో ఆ మూవీ చేశాను. తర్వాత ఓంకార్గారి దర్శకత్వంలో ’జీనియస్’ సినిమా చేశాను. నువ్విలా, జీనియస్ ఈ రెండు చిత్రాలు నటుడిగ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. హీరోగా నా కెరీర్కు మంచి పునాది వేశాయి. ఆ తర్వాత చేసిన ’రామ్లీల’ అనుకు న్నంత సక్సెస్ కాలేదు. కానీ నాకు నేను చేసిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా మాత్రం రామ్లీల. ప్రస్తుతం సిని మాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు న్నాను. కథ నచ్చితేనే సినిమా చేయాలని నిర్ణయించుకు న్నాను. ఇప్పుడు జవహర్బాబుగారు, రమేష్వర్మగారు సంయు క్తంగా నిర్మించే సినిమాలో నటిస్తున్నాను. సాయి అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఇది కామెడి థ్రిల్లర్. ఇందులో కథే హీరో. నా క్యారెక్టరై జేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారు. తెలుగు, తమిళంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కమర్షియల్గా సినిమా ఆడియెన్స్ను అలరిస్తుంది. జవహర్బాబుగారి ప్రొడక్షన్ లోనే నా నెక్స్ట్ మూవీ కూడా ఉంటుంది. నటుడిగా ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తాను. అయితే ఇతర హీరోల క్లబ్లో ఇప్పట్లో నటిచను అన్నారు.