జైపుర్ : ట్రాఫిక్ నిబంధన లను పాటించకుంటే ప్ర మాదం తప్పదని హెచ్చరిం చేందుకు జైపుర్ ట్రాఫిక్ పోలీసు శాఖ తన చిత్రాన్ని వాడుకోవడంపై టీమిండి యా పేసర్ బుమ్రా అసహ నం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చాలా బాగా చే శారు. దేశం కోసం అత్యు త్తమంగా పోరాడితే మీరిచ్చే గౌరవమేంటో తెలుస్తోంది. పనిలో మీరు చేసే పొరపా ట్లను మీలా నేనేం అపహా స్యం చేయను... ఆందోళన చెందకండి అని జైపుర్ ట్రాఫిక్ పోలీసు శాఖకు బుమ్రా ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన జైపుర్ ట్రాఫిక్ పోలీ సు శాఖ వివరణ ఇచ్చింది. ‘‘ప్రియమైన బు మ్రా... నిన్ను బాధించాలని మా ఉద్దేశం కాదు. నీ సెంటిమెంట్లను, లక్షలాది క్రికెట్ అభిమానుల సెంటిమెంట్లను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో మేము అలా చేయలేదు. ప్రజల్లో ట్రాఫిక్ నిబం దనలపై అవగాహన పెంచాలన్న ఉద్దేశంలో నీ ఫొటోను వాడుకున్నాం. బుమ్రా నువ్వు మా అం దరికీ స్ఫూర్తి. ఆదర్శం’’. అని జైపుర్ ట్రాఫిక్ పోలీ సు శాఖ ట్విటర్ ద్వారా పేర్కొంది. పాకిస్థాన్తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా బుమ్రా నోబాల్ వేస్తున్న దౄఎశ్యాన్ని తీసుకుని జైపుర్ ట్రాఫిక్ పోలీసు శాఖ గీత దాటొద్దు... అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు అన్న సందేశాన్ని ఉంచింది. ఆ మ్యాచ్లో బుమ్రా నోబాల్ వేయడంతో బతికిపోయిన ఫకర్ జమాన్ శతకంతో పాకిస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.