పోర్టఆఫ్స్పెయిన్ : భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే వర్షం కారణంగా రద్దెన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన భారత ఆటగాడు కుల్దీప్ యాదవ్ అత్యంత అరుదైన ఘనతను అందుకున్నాడు. ఫలితం తేలని మ్యాచ్లో సాధించిన ఘనత ఏమిటా అని ఆలోచిస్తున్నారా..! అరంగేట్రం చేసిన తొలి వన్డేలో ఫలితం రాకపోవడమే కుల్దీప్ దక్కించుకున్న ఘనత. ఇప్పటి వరకు ఎనిమిది మంది ఆటగాళ్లు అరంగేట్రం చేసిన వన్డేలో ఫలితం సాధించలేకపోవడం విశేషం. 1992లో తొలిసారి అజయ్ జడేజా ఈ ఘనతను అందుకున్నాడు. ఆ తర్వాత పారస్ హంబ్రే(1996), హౄఎషికేశ్ కానిత్కర్(1997), ఆర్పీ సింగ్(2005), మనోజ్ తివారి(2008), సుదీప్ త్యాగి(2009), రహానె(2011), కుల్దీప్ యాదవ్ (2017)లు ఆడిన తొలి వన్డేల్లో ఫలితం రాలేదు. భారత వన్డే జట్టుకి ప్రాతినిధ్యం వహించిన 217వ ఆటగాడు కుల్దీప్. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-వెస్టిండీస్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.