పోర్టఆఫ్స్పెయిన్ : ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే వర్షం కారణంగా రద్దెన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కి సంబంధిం చిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్మీడియా లో వెరల్గా మారింది. ఇంతకీ ఆ ఫొటో ఎవరిదో తెలుసుకోవా లని ఉందా... భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు భారత్ను మొదట బ్యాటింగ్కి ఆహ్వానించింది. 38వ ఓవర్ ముగిసే వరకు మ్యాచ్ సజావుగా సాగింది. ఈ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్కి అంతరాయం కలిగింది. కాస్త విరామం తర్వాత మ్యాచ్ని తిరిగి ఆరంభించినా మళ్లీ వర్షం రావడంతో అంపైర్లు విరామం ప్రకటించారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు వారికి కేటాయించిన డ్రస్సింగ్ రూమ్లకు చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కోహ్లీ డ్రస్సింగ్ రూమ్ కిటికీ అద్దం వద్ద నిల్చుని బయటికి చూస్తూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోనే ఇప్పుడు సోషల్మీడియాలో వెరల్గా మారింది. ‘అందమైన అమ్మాయి కోసం వెతికింది చాలు’... ‘బయటి నుంచి స్నేహితులు పిలుస్తున్నారా... అమ్మకి చెప్పి వెళ్లు’.. ‘టీవీ ఆఫ్ చేయండి... కుంబ్లే కనపడుతున్నాడు’ అంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు జతచేశారు.