డెర్బీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా శుభారంభం చేసింది. మెగా టోర్నీని మిథాలీరాజ్ సేన అద్భుత విజయంతో ఆరంభించింది. సమష్టి ప్రదర్శనతో పటిష్ఠ ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపై 35 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 2012 తర్వాత టీమిండియాకు ఆతిథ్య జట్టుపై ఇదే తొలి విజయం కావడం విశేషం. టాస్ ఓడిన మిథాలీ బౄఎందం 3 వికెట్లు నష్టపోయి ప్రత్యర్థికి 282 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. స్కృతి మంధన (90; 72 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు), పూనమ్ రౌత్ (86; 134 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), మిథాలీ రాజ్ (71; 73 బంతుల్లో 8 ఫోర్లు), హర్మన్ప్రీత్ కౌర్ (24 నాటౌట్; 22 బంతుల్లో 1ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టులో ఫ్రాన్ విల్సన్ (81; 75 బంతుల్లో 6 ఫోర్లు), హేథర్ నైట్ (46; 69 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. ఐతే భారత బౌలర్లు మిగతా బ్యాట్స్వుమెన్ను కుదురుకోనివ్వలేదు. దీప్తిశర్మ (3/47), శిఖపాండే (2/35), పూనమ్ యాదవ్ (1/51) చక్కగా బౌలింగ్ చేశారు.
ముందు ఓపెనర్లు.. తర్వాత సారథి
ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఆరంభ పోరులో టాస్ ఓడిన బ్యాటింగ్కు దిగిన టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఓపెనర్లు స్కృతి మంధన (90), పూనమ్ రౌత్ (86) చెలరేగి 144 పరుగుల భారీ భాగస్వామ్యం అందించడంతో మిథాలీ సేనకు శుభారంభం లభించింది. స్కృతి 45 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేసింది. 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె ఔట్ కావడంతో కెప్టెన్మిథాలీరాజ్ (71) క్రీజులోకి వచ్చింది. తనదైన శైలిలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. ఆచితూచి ఆడుతూనే సొగసైన బౌండరీలు బాదింది. పూనమ్ రౌత్ అర్ధశతకం సాధించిన తర్వాత మరింత చెలరేగింది. వరుసగా 7వ అర్ధశతకం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. పూనమ్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన హర్మన్ప్రీత్ (24 నాటౌట్)తో ఆఖరి ఐదు ఓవ ర్లలో చక్కగా పరుగులు రాబట్టింది. దీంతో ఇంగ్లాండ్పై వన్డేల్లో టీమిండియా అత్యుత్తమ స్కోరు సాధించింది. గతంలో ఇది 243 కావడం గమనార్హం.