ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో సంతోషం తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిలంకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు దావత్-ఎ-ఇఫ్తార్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మత సామరస్యానికి, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన తెలంగాణలో… ప్రజలంతా ఆనందంగా ఉండాలని, గంగా జమునా తెహజీబ్ సంస్కృతి ప్రతిబింబించేలా పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు.