మహబూబ్నగర్ : కృష్ణా నదీ జలాలను కోయిల్సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు. వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి హుటాహుటిన జూరాల బ్యాక్ వాటర్ను ఉంద్యాలకు విడుదల చేసి.. అక్కడి నుంచి మొదటి లిఫ్ట్ ద్వారా పార్దీపూర్ రిజర్వాయర్ను నింపారు. ఇవాళ సీలేరు రెండో లిఫ్ట్ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి.. కోయిల్సాగర్కు నీటిని విడుదల చేశారు. ఇక్కడి నుంచి మూడు రోజుల్లో కోయిల్సాగర్ ప్రాజెక్టుకు కృష్ణా వాటర్ చేరుకోనుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 6.68 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 3022 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 499 క్యూసెక్కులుగా ఉంది.