హైదరాబాద్ : నగరంలో గోల్కొండ బోనాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బోనాల ఉత్సవాల అంకురార్పణ ఘనంగా జరిగింది. లంగర్హౌస్ నుంచి గోల్కొండ వరకు ఘటాలతో పాటు తొట్టెలు, బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్ర్తాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి సమర్పించారు. బోనాల పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని మంత్రులు ప్రజలకు చెప్పారు. పండుగ నిర్వహణలో ప్రపంచ గుర్తింపు సాధించాలని పేర్కొన్నారు. బోనాల పండుగ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి.