ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఐటీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2017, 02:10 PM

న్యూఢిల్లీ:  ఐఐటీ ప్రవేశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఐఐటీ–జేఈఈ 2017 (అడ్వాన్స్‌డ్‌) ఫలితాల ఆధారంగా నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వెంటనే ఆపాలని దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలకు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు సోమవారం ఎత్తివేసింది. గ్రేస్‌ మార్కుల వివాదంపై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.  కౌన్సెలింగ్, ప్రవేశాలకు సంబంధించిన ఎలాంటి పిటిషన్లనూ స్వీకరించరాదని హైకోర్టులకు సుప్రీంకోర్టు  సూచించింది. కాగా  ఐఐటీ–జేఈఈ 2017 ర్యాంకుల జాబితా, అభ్యర్థులందరికీ అదనపు మార్కులు కేటాయించడాన్ని సవాలు చేస్తూ వివిధ హైకోర్టుల్లో ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయో చెప్పాలని ఆయా రిజిస్ట్రీలను ఆదేశిస్తూ విచారణను సుప్రీంకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్టే ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa