ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యతకు తూట్లు మూన్నాళ్లకే పగుళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2017, 02:47 PM

సదాశివనగర్: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గిడ్డంగి పనుల్లో నాణ్యత లోపించడం వలన మూన్నాళ్లకే పగుళ్లు వస్తున్నాయి. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లోపించడం వలన రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలగడం లేదు. రైతుల పంటలు, ఎరువులు నిల్వల కొరకు వివిధ నిధుల నుండి సుమారు. రూ.23 లక్షల 50 వేలతో నిర్మించిన వ్యవసాయ గిడ్డంగికి వచ్చిన పగుళ్లే దీనికి తాజా నిదర్శనం. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో సంతృప్తిగా ఉన్న, పారదర్శకతతో లోపిస్తున్న ఇలాంటి పనులతో నాయకులపై ప్రజల్లో నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. పలు సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లకు పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని సూచిస్తూ ఇప్పటికే పనులు నాసిరకంగానే జరుగుతున్నాయి. 500 మెట్రిక్ టన్నుల సామర్థంగల ఈ గోదాంకు పగుళ్లు రావడంతో పలువురు పలురకాలుగా అనుకుంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa