ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడవ బోల్తా: ఐదు మృతదేహాలు వెలికితీత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2017, 05:17 PM

 మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన పడవ బోల్తా ఘటనలో ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా విహార యాత్రకు వెళ్లిన కొందరు యువకులు  ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కలమేశ్వర్‌ ప్రాంతంలోని వేనే డ్యాంలో వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదుగురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa