జీఎస్టీ విధానంలో పన్ను ఎగవేతలను పసిగట్టేందుకు ఏర్పాటు చేసిన నిఘా విభాగానికి కేంద్రం చీఫ్ను నియమించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్గా (డీజీ జీఎస్టీఐ) సీనియర్ అధికారి జాన్ జోసెఫ్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ముంబైలో బాధ్యతలు నిర్వహిస్తున్న జోసెఫ్.. త్వరలోనే జీఎస్టీఐ డీజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1983 సంవత్సరం బ్యాచ్కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్) అధికారి అయిన జోసెఫ్ ఇప్పటివరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)తోపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పలు కీలక డిపార్ట్మెంట్లలో పనిచేశారు. గత పరోక్ష పన్నుల విధానంలో సేవా పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం ఎగవేతలను పసిగట్టేందుకు సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ విభాగం ఉండేది. కొత్త విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ విభాగ పేరును జీఎస్టీఐగా మార్చారు. స్మగ్లింగ్, బ్లాక్మనీ కట్టడికి కృషి చేసే డీఆర్ఐకి కూడా కొత్త చీఫ్ను నియమించింది ప్రభుత్వం. 1985 సంవత్సరం బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ దేవి ప్రసాద్ దాస్ డీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa