హైదరాబాద్: సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. హరితహారం మూడవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం ఎర్రవల్లి గ్రామం నుంచి కరీంనగర్ కు బయల్దేరారు. ఆకుపచ్చని మహాస్వప్నం సాకారం కోసం తెలంగాణ సిద్ధమైంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం మూడోవిడుతకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉదయం 11.30 గంటలకు కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ వద్ద మొక్కలు నాటి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 శాతంగా ఉన్న అడవుల శాతాన్ని 33శాతం పెంపు లక్ష్యంగా ప్రారంభమైన హరితహారం తొలి రెండు విడుతల్లో దాదాపు 48 కోట్ల మొక్కలను నాటారు. ఈసారి లక్ష్యాన్ని పెంచి కనీసం 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ విడుతలో పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి వారి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. మొక్కలు నాటడంతోపాటు ఏడాది పొడవునా వాటిని సంరక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ బ్రిగేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొక్కల సంరక్షణకు కృషిచేసిన వారికి హరితమిత్ర అవార్డులతో పాటు రూ. లక్షనుంచి రూ. 15 లక్షల చొప్పున సుమారు రూ.15 కోట్ల విలువచేసే నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa