ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరితహారంలో పాల్గొన్న నగర డిప్యూటీ మేయర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2017, 12:26 PM

హైదరాబాద్: మూడవ విడత హరిత యజ్ఞం నగరంలో ఘనంగా ప్రారంభమైంది. మొదటి విడతలో 35 లక్షలు, రెండో విడతలో కోటి మొక్కలు నాటిన హెచ్‌ఎండీఏ, ఈ సారి 2.5కోట్ల మొక్కలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే 21 చోట్ల 1.10 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో రంగంలోకి దిగింది. ఔటర్ రింగ్‌రోడ్డులోని శామీర్‌పేట ఇంటర్ చేంజ్ వద్ద ఒక్కరోజే లక్ష మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాల విద్యార్థి నుంచి మొదలుకుని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎస్‌ఎఫ్, ఎఎఫ్‌ఎస్ సహా అన్ని స్థాయి అధికారులు, స్వచ్ఛంద, ఐటీ సంస్థలు హరితహారంలో భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో భాగంగా నగర డిప్యూటీ మేయర్ బాబా ఫిసియూద్ధీన్ పాఠశాల విద్యార్థులతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa