ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరితహారంలో పాల్గొన్న మంత్రి తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2017, 02:21 PM

హైదరాబాద్ : సనత్ నగర్ లోని అంబేడ్కర్ నగర్, జీహెచ్ఎంసీ పార్క్, అమీర్ పేటలోని వాటర్ ట్యాంకు వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 56 పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్స్, విద్యార్థులు హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa