ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇండస్ట్రీ సెమినార్ ప్రారంభించిన కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2017, 11:59 AM

హైదరాబాద్ : బేగంపేట ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ సెమినార్ జరిగింది. ఈ సెమినార్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అనువైన స్థలమని చెప్పారు. కంపెనీల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఇక్కడే ఉందన్నారు. ఎన్నో పరిశోధనా సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఏరోస్పేస్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ రంగంలో హైదరాబాద్ ముందుందని తెలిపారు. ట్రంప్ హెలికాప్టర్ క్యాబిన్ కూడా ఇక్కడే తయారైతదని చెప్పారు. మార్చిలో ఇండియన్ ఏవియేషన్ షో నిర్వహణ ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో రక్షణ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. టీహబ్ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తున్నదని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa