ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తాం: డీజీపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2017, 02:35 PM

హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు.  ఎక్కడినుంచి ఎవరొచ్చినా పట్టుకుంటున్నామని, ఇంటెలిజెన్స్ సమాచారంతో నివారణచర్యలు చేపడుతూ కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఇతరశాఖలు డ్రగ్స్ నివారణ విషయంలో అప్రమత్తంగా ఉండటంతోపాటు నివారణ చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కల్తీ ఆహారం, విత్తనాలు, మాదకద్రవ్యాల విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. వీటిని నియంత్రించేందుకు సంబంధిత అన్నిశాఖలతో కలిసి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేశామని చెప్పారు. అన్నిజిల్లాల పోలీసులు, సంబంధిత శాఖలతో సమావేశమై పలు నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే చాలాజిల్లాల్లో పెద్దఎత్తున కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ విత్తనాలు సీజ్ చేసి, నిందితులను అరెస్టులు చేశామన్నారు. డ్రగ్స్ మాఫియా మూలాలపైనా నిఘా కొనసాగుతున్నని ఆయన తెలిపారు. చాలామందిని గుర్తించి అరెస్టు చేశామని, బయటనుంచి వస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టామని, విదేశీయులపైనా నిఘా ఉన్నదని డీజీపీ వివరించారు. పోలీసుశాఖపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టి, నిధులు మంజూరు చేస్తున్నారని, పోలీసుశాఖ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నదని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa