కోహిమా: నాగాలాండ్ రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరిగాయి. గవర్నర్ ఆదేశాల మేరకు సీఎం షుర్హోజెలీ లీజిత్సు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. అయితే ఈ బలపరీక్షకు సీఎం లీజిత్సు, ఆయన మద్దతుదారులు రాలేదు. దీంతో అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. అసలేం జరిగిందంటే..
నాగాలాండ్లో మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్ ఎదురుతిరిగిన విషయం తెలిసిందే. మొత్తం 47 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తనకే మద్దతిస్తున్నారని, తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని జెలియాంగ్ గవర్నర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జులై 15 లోపు అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆచార్య ప్రస్తుత సీఎం లీజిత్సుకు సూచించారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన లీజిత్సు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన గువాహటిలోని కోహిమా బెంచ్ న్యాయస్థానం గవర్నర్ ఆదేశాలపై జులై 17 వరకు స్టే విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జులై 18న మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో బలపరీక్షకు సిద్ధమవ్వాలని గవర్నర్ సీఎం లీజిత్సును సూచించారు. బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలని నాగాలాండ్ అసెంబ్లీ స్పీకర్ను కోరారు. దీంతో ఈ రోజు ఉదయం 9.30 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. అయితే బలపరీక్షకు సీఎం లీజిత్సు, ఆయన మద్దతుదారులు హాజరుకాలేదని స్పీకర్ మీడియాకు తెలిపారు. వారితో ఫోన్లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదన్నారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa