ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతలను పూడ్చివేయండి : జీహెచ్‌ఎంసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2017, 12:57 PM

హైదరాబాద్ నగరంలో వర్షాల నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్లతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించారు. నగరంలో రోడ్లపై పడ్డ గుంతలను తక్షణమే పూడ్చివేసి మరమ్మతులు చేయాలని ఇంజినీర్లను కమిషనర్ ఆదేశించారు. రోడ్ల నిర్వహణపై యూనిట్ రేట్లను నిర్ణయించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ విధానం వల్ల టెండర్లు పిలిచే అవసరం ఉండదన్నారు కమిషనర్. రద్దీ ప్రాంతాల్లో పునరుద్ధరణ తక్షణమే చేపట్టి.. రాత్రివేళల్లో శాశ్వత పునరుద్ధరణ చేపట్టాలని ఆదేశించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa