భవిష్యత్ తరాల బంగారు భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. చెట్లు ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో జరిగిన హరితహారంలో మంత్రి పోచారం పాల్గొన్నారు. ఇబ్రహీంపేట-దేశాయిపేట సీసీ రోడ్డు పక్కన మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. హరితోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.