టీఆర్ఎస్ నేతలపై చిల్లర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సీరియస్ అయ్యారు. ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ అంటూ బాపూజీని అవమానిస్తున్నారని మండిపడ్డారు. గెలవలేమని తెలిసి కూడా గోపాలకృష్ణ గాంధీని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పప్పుగా ప్రసిద్ధి గాంచితే.. మంత్రి కేటీఆర్ సమర్థత ఏంటో ప్రపంచానికి తెలుసన్నారు. గులాబీ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.