టర్కీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 2016 జులై 15న జరిగిన కుట్ర విఫలమై ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని టర్కీ కాన్సులేట్ కార్యాలయంలో ఇవాళ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మేయర్ బొంతు రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొని టర్కీ కాన్సుల్ జనరల్ అర్థ ఉల్తాస్తో కలిసి ఆనందోత్సాన్ని పంచుకున్నారు. 2016 జూలై 15న టర్కీలోని అంకార, ఇస్తాంబుల్ నగరాల గగనతలంలో మొట్టమొదటిసారిగా జెట్ ఫైటర్లు కలియతిరిగాయని, వీటిని మిలిటరీ తిరుగుబాటుగా భావించామని మేయర్కు టర్కీ రాయబారి వివరించారు. అయితే, అది మిలిటరీ తిరుగుబాటు కన్నా అధికంగా ఉన్నప్పటికీ టర్కీ ప్రజలు తిప్పికొట్టారని వివరించారు. ఫేటో ఉగ్రవాద సంస్థ జరిపిన అక్రమ దాడిలో అమాయకులైన 250మంది పౌరులు అమరులయ్యారని మేయర్ రామ్మోహన్కు ఉల్తాస్ తెలిపారు. ఈ దురాగతాన్ని టర్కీ ప్రజలు ఇప్పటికి మరవలేకపోతున్నారని అన్నారు. కాగా, టర్కీ ప్రజల ధైర్యాన్ని మేయర్ రామ్మోహన్ ప్రశంసించారు.