హైదరాబాద్: చైతన్యపురి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి మెట్రో స్తంభాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు మీది నుంచి దూసుకెళ్లడంతో మెట్రో స్తంభం కింద నిద్రిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు కొత్తపేట ఓమ్ని ఆస్పత్రికి, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దిల్సుఖ్నగర్లో పుట్టిన రోజు వేడుకలు ముగించుకుని ఎల్బీనగర్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.