భద్రాచలం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 33.4 అడుగులు ఉంది. సోమవారం సాయంత్రం 16.4 అడుగులున్న గోదావరి నీటిమట్టం.. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 17.8అడుగులకు చేరుకుంది. బుధవారం కొద్దిసేపు నిలకడగా ఉన్న నీటిమట్టం.. సాయంత్రానికి తగ్గింది. మళ్లీ రాత్రి నుంచి పెరుగుతూ వస్తుంది. తాలిపేరు ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి 22,552 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఏటూరునాగారం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.