హైదరాబాద్ : హైదరాబాద్లో కలకలం రేపుతోన్న డ్రగ్స్ మాఫియా వ్యవహారంపై దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని, కావాలంటే ఈ వ్యవహారంపై విచారణ ఎలా జరుగుతుందో చూడాలని, ఈ కేసులో టీఆర్ఎస్ నేతలున్నా ప్రశ్నిస్తారా అని కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు.