హైదరాబాద్ :ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై దిగ్విజయ్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లోనే తిప్పికొట్టారు. దిగ్విజయ్ సింగ్కు మతి భ్రమించిందని, ఇక ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ స్పెల్లింగ్ తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.