హైదరాబాద్: తెలంగాణపై విషం చిమ్మిన కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్సింగ్పై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. దిగ్విజయ్ విచక్షణ కోల్పోయారు. వారు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వయస్సుకు తగ్గట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇప్పటికైనా తెలంగాణ పదం సరిగా రాయడం నేర్చుకోవడం సంతోషమన్నారు. తెలంగాణలో భారీ డ్రగ్స్ కుంభకోణం బయటపడింది. ప్రభావితం చేయగల టీఆర్ఎస్ నేతల మిత్రుల పాత్ర ఉంది. నిందితులను రక్షిస్తారా?.. విచారిస్తారా? అని దిగ్విజయ్సింగ్ టిట్టర్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ పై విధంగా స్పందించారు.