మహబూబ్నగర్: జూరాల నీటి విడుదలపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్రావు, జూరాల ఎస్ఈ రఘునాథ్ పాల్గొన్నారు. ప్రాజెక్టులోకి నీరు చేరుతున్నందున సాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఆల్మట్టి, నారాయణపూర్ వరద ఉద్ధృతి పరిశీలించి నీటిని విడుదల చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. గద్వాల, వనపర్తి జిల్లా కలెక్టర్లతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. త్వరితగతిన నీటిని విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.