కరీంనగర్: కరీంనగర్ లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంబించారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించుకుంటున్నాం. దీంతో మాతా, శిశు మరణాలను జీరోకు తిసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గర్భిణిలు ఇంటి వద్ద ప్రసవం కాకుండా ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యేలా చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చే రూ.13వేల నగదు, కేసీఆర్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.