ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాద్రి దగ్గర ప్రస్తుత నీటిమట్టం 33.4 అడుగులకు చేరుకుంది. ముఖ్యంగా వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చింది. ప్రాజెక్టులోని 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.