హైదరాబాద్: జీహెచ్ఎంసీ రోడ్లు, మూసి డెవలప్మెంట్, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ రోజు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అధికారులు పాల్గోన్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో జీహెచ్ఎంసీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు రొడ్ల మరమ్మతు కార్యక్రమాల్లో పాల్గొనలని అదేశించారు. ఈ మేరకు వచ్చే మూడు నెలల పాటు అధికారులంతా సాద్యమైనంత ఎక్కువ సమయం ఈ మరమ్మతులకు కేటాయించాలని కోరారు. నూతనంగా నిర్మించబోయే ఫ్లై ఓవర్లు, స్కై వేల నిర్మాణాల్లో బీటి రోడ్ల బదులు పూర్తిగా సిమెంట్ రోడ్లు వేయాలని, దీంతో కనీసం దశాబ్ద కాలంపాటు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు. ఈ సూచన నేపథ్యంతో ప్రాజెక్టులకు అయ్యే అదనపు వ్యయంపైన నివేదిక తయారు చేయాలన్నారు. హైదరాబాద్ రొడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న రోడ్ల తాలుకు డీపీఆర్ తయారీకి ఒక్క కన్సల్టెంట్ తో మాత్రమే కాకుండా సాద్యమైనంత ఎక్కవ మందికి అధిక కన్సల్టెంట్లతో పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు.ఈ మేరకు ఈ నెల 22న జరిగే ప్రీడ్ సమావేశానికి అనుభవం, పేరు ఉన్న కంపెనీలకు మాత్రమే అహ్వానాలు పంపాలన్నారు. సాద్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.