ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసి ప్రక్షాళనపై అధికారులతో మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 01:38 PM

హైద‌రాబాద్‌: జీహెచ్ఎంసీ రోడ్లు, మూసి డెవల‌ప్‌మెంట్‌, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఈ రోజు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పోరేషన్ అధికారులు పాల్గోన్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో జీహెచ్ఎంసీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు రొడ్ల మరమ్మ‌తు కార్యక్రమాల్లో పాల్గొన‌ల‌ని అదేశించారు. ఈ మేరకు వచ్చే మూడు నెలల పాటు అధికారులంతా సాద్యమైనంత ఎక్కువ సమయం ఈ మరమ్మ‌తులకు కేటాయించాలని కోరారు. నూతనంగా నిర్మించబోయే ఫ్లై ఓవర్లు, స్కై వేల నిర్మాణాల్లో బీటి రోడ్ల బదులు పూర్తిగా సిమెంట్ రోడ్లు వేయాలని, దీంతో కనీసం దశాబ్ద కాలంపాటు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు. ఈ సూచన నేపథ్యంతో ప్రాజెక్టులకు అయ్యే అదనపు వ్యయంపైన నివేదిక తయారు చేయాలన్నారు. హైదరాబాద్ రొడ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పోరేషన్ పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న రోడ్ల తాలుకు డీపీఆర్‌ తయారీకి ఒక్క కన్సల్టెంట్ తో మాత్రమే కాకుండా సాద్యమైనంత ఎక్కవ మందికి అధిక కన్సల్టెంట్లతో పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు.ఈ మేరకు ఈ నెల 22న జరిగే ప్రీడ్ సమావేశానికి అనుభవం, పేరు ఉన్న కంపెనీలకు మాత్రమే అహ్వానాలు పంపాలన్నారు. సాద్యమైనంత త్వరగా టెండ‌ర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com