భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇళ్ల స్థలాలక్రమబద్దీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈమేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 171లోని విధి విధానాలను ఈరోజు కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశoలో ఎమ్మెల్యే జలగం వెంకటరావు వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ జీవోతో 6650మందికి లబ్ది చేకూరనుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లోఉన్న ఈ సమస్యకు సీఎం కేసీఆర్ ఆశిర్వాదంతో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కే.తారకరామారావుల సహకారంతో ఈ క్రమ బద్దీకరణ ఉత్తరువులు జారీ అయ్యాయని చెప్పారు. జీవో జారీకి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.