హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్ దందా పై ట్వీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్సింగ్ కు కేటీఆర్, బాల్క సుమన్ తమ దైన శైలిలో ఘాటు జవాబు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు హీరోయిన్ మంచు లక్ష్మి కూడా దిగ్విజయ్ ట్వీట్ పై స్పందించింది. రామ్ చెప్పినట్లుగానే ఆయనకు మతి ఎప్పుడో భ్రమించిందంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.