గోదావరిఖని పట్టణంలోని ఫ్రెండ్స్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో నిత్యావసర సరుకులను పోలీసులు పట్టుకున్నారు. ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 15 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు కంపెనీలో కనిపించాయి. వాటికి సరైన బిల్లులు లేకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. గోదావరిఖని ఏసీపీ అపూర్వ రావ్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు.