డ్రగ్స్ వ్యవహారంలో సినీమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడితో సిట్ అధికారుల విచారణ ముగిసింది. నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయంలో సుమారు ఐదున్నర గంటల పాటు ఆయన్ని విచారించారు. కొరియర్ ద్వారానే తాను డ్రగ్స్ తెప్పించుకునేవాడినని శ్యాం కె నాయుడు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, డ్రగ్స్ తీసుకునే అలవాటు తనకు లేదని ఆయన మొదట్లో చెప్పినప్పటికీ, అధికారులు ఆధారాలు చూపించడంతో శ్యాం కె నాయుడు అసలు విషయం చెప్పినట్టు సమాచారం. డ్రగ్స్ సరఫరా దారుడు కెల్విన్ ని ఎన్నిసార్లు కలిశారని, అతనితో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. సినిమాల్లో షూట్ లొకేషన్ల కోసం చాలా పబ్స్ కు వెళ్లానని, పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లతో పరిచయాలు ఉన్నాయని శ్యామ్ చెప్పినట్టు సమాచారం.