భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండల పరిధిలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ పార్కును ఎమ్మెల్యే జలగం వెంకటరావు సందర్శించారు. పార్కులో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల ప్రతిమలను పరిశీలించారు. అనంతరం హరితహారం మూడో విడత కార్యక్రమంలో భాగంగా కిన్నెరసానిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు విద్యార్థులు, అధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.