హైదరాబాద్: భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్నాథ్ నాయకత్వంలో దేశం మరింత ముందుకెళ్తుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యం స్ఫూర్తిని కొనసాగించడంలో రామ్ నాథ్ కోవింద్ విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు. రామ్ నాథ్ కోవింద్కు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.